పట్టాలు తప్పిన గోల్కొండ: 18 మంది మృతి
వరంగల్: గోల్కొండఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 18 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న గోల్కొండఎక్స్ప్రెస్ బ్రేక్ ఫెయిల్ కావడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. బుధవారం ఉదయం 10.25 గంటల ప్రాంతంలో వరంగల్ దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది.
వరంగల్ స్టేషన్ లోకి ప్రవేశిస్తుండగా,రైలు ఇక ఆగుతుందనుకుంటున్న సమయంలో బ్రేక్లుఫెయిల్ కావడంతో ఇంజన్ ఆగకుండా వెళ్ళి లూప్ లైన్ లోకి వెళ్ళిపోయింది. లూప్ లైన్ లో ట్రాక్ దాటిన తర్వాత కూడా ఇంజన్ వెళ్ళి..ఇంజన్తో పాటు మూడు బోగీలు ఓవర్ బ్రిడ్జిపై నుంచి కింద రోడ్డుమీద వెళ్తున్న రెండు ఆటోలపై పడ్డాయి. రోడ్డుపై వెళుతోన్న నలుగురు వాహన చోదకులు మరణించారు.
రైలు ప్రయాణీకులు 14 మంది మరణించారు. రోడ్డుపై పడినరైలు బోగీలు తుక్కు తుక్కు అయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనేరైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ న్యూఢిల్లీ నుంచి వరంగల్కువిచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదాన్ని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. గాయపడిన వారు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.