వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరుకు డాక్టరేట్ అందచేయని ఏయూ
హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోపీపుల్స్వార్ నక్సలైట్ల హింసలో ముగ్గురు మరణించగా, పోలీసుల ఎన్కౌంటర్లో ఒకపీపుల్స్వార్ నక్సలైట్ హతమయ్యాడు.
ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్వార్ నక్సలైట్లు తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి సభ్యుడు రాంచందర్ను హత్య చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి సమీపంలోని డాబా హోటల్పై శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో దాడి చేసి నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు తండ్రీకొడుకులను కాల్చి చంపారు.
నక్సల్స్ దాడిలో మరణించినబ్రహ్మారెడ్డి, సుమన్ రెడ్డి స్థానికంగా తెలుగుదేశం కార్యకర్తలు. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం రాతెండికోట అటవీ ప్రాంతంలోపీపుల్స్వార్ నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో శ్రీనివాస్ అనే నక్సలైట్ మరణించాడు. నక్సలైట్ల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Comments
Story first published: Friday, July 4, 2003, 23:53 [IST]