వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోల్కండ: శనివారం బహిరంగ విచారణ
హైదరాబాద్, వరంగల్ : వరంగల్ వద్ద జరిగిన గోల్కండ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై విచారణ సాగిస్తోన్న అగర్వాల్ కమిటీ శనివారం బహిరంగ విచారణ చేపట్టనుందని రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మరో పది రోజుల్లోనే విచారణ పూర్తవుతుందని ఆయన చెప్పారు. అగర్వాల్ నివేదిక అందిన తర్వాత దోషులు ఎవరనేది కచ్చితంగా తెలుస్తుందని దత్తాత్రేయ అన్నారు. అలాగే, బాధితులకు నష్ట పరిహారం త్వరలోనే అందచేస్తామన్నారు.
మరోవైపు, తొలిసారిగా రైల్వే శాఖపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డున ప్రయాణిస్తోన్న ఆరుగురి ప్రాణాలను బలిగొన్నారని వరంగల్ పోలీసులు రైల్వేశాఖపై నేరాభియోగాన్ని మోపుతూ కేసును నమోదు చేశారు.
Comments
Story first published: Friday, July 4, 2003, 23:53 [IST]