వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజోలి: ఘర్షణ, 20మందికి గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌: పాలమూరు, కర్నూలు జిల్లాల మధ్య మరోసారి చిచ్చు రేపుతోన్న రాజోలిబండ మల్లింపు పథకంవివాదం శుక్రవారం మరింత ముదిరింది. ఇరు జిల్లాలకు చెందిన ప్రజలు, రైతులు ప్రాజెక్ట్‌ వద్దకు వచ్చిఒకరిపై రాళ్ళు రువ్వుకున్నారు. బాంబులు సైతంవిసురుకున్నారు. ఈ ఘర్షణలో దాదాపు 20 మందికి గాయాలుకాగా, ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు.

ఆసుపత్రిలో చికిత్సపొందుతోన్న అతని పరిస్థితివిషమంగా ఉంది. రాజోలిబండ స్లూయిజ్‌ మూసివేత జరగాలని పాలమూరు రైతులు పట్టుబడుతుండగా, మూసివేయవద్దని కర్నూలు రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం ఈ ప్రాంతంలో ఇరు జిల్లాలకు చెందిన రైతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. శుక్రవారంపెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు ఆవేశాన్ని అదుపు చేసుకోలేక రాళ్ళుఒకరిపై ఒకరు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని అదుపు చేయలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X