వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజోలి: ఘర్షణ, 20మందికి గాయాలు
మహబూబ్ నగర్: పాలమూరు, కర్నూలు జిల్లాల మధ్య మరోసారి చిచ్చు రేపుతోన్న రాజోలిబండ మల్లింపు పథకంవివాదం శుక్రవారం మరింత ముదిరింది. ఇరు జిల్లాలకు చెందిన ప్రజలు, రైతులు ప్రాజెక్ట్ వద్దకు వచ్చిఒకరిపై రాళ్ళు రువ్వుకున్నారు. బాంబులు సైతంవిసురుకున్నారు. ఈ ఘర్షణలో దాదాపు 20 మందికి గాయాలుకాగా, ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్సపొందుతోన్న అతని పరిస్థితివిషమంగా ఉంది. రాజోలిబండ స్లూయిజ్ మూసివేత జరగాలని పాలమూరు రైతులు పట్టుబడుతుండగా, మూసివేయవద్దని కర్నూలు రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం ఈ ప్రాంతంలో ఇరు జిల్లాలకు చెందిన రైతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. శుక్రవారంపెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు ఆవేశాన్ని అదుపు చేసుకోలేక రాళ్ళుఒకరిపై ఒకరు రాళ్లు రువ్వడం ప్రారంభించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని అదుపు చేయలేకపోయారు.
Comments
Story first published: Friday, July 4, 2003, 23:53 [IST]