వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఆధునిక వ్యవసాయ పాఠాలు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంభించి నష్టాలను నివారించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జన్మభూమి కార్యక్రమలంలో భాగంగా ఆయన విశాఖ జిల్లా అడవి అగ్రాహారం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.

ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకునే సమయానికి ముందే వర్షం మొదలైంది. అయనా, ప్రజలు, రైతులు ఆయన కోసం అలాగే వేచి ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా వర్షంలో తడుస్తూనే ప్రసంగించారు. ఆయన మైక్‌ అందుకున్న వెంటనే రైతులకు ఆధునిక పాఠాలు మొదలుపెట్టారు.

దుక్కి దున్నినప్పుట్నుంచే ఆధునిక పద్దతులు మొదలుపెట్టండి. భూసార పరీక్ష నిర్వహించండి. దాన్ని బట్టే మీరు విత్తనాలు సెలక్ట్‌ చేసుకొండి...అంటూ వరుసగా బాబు రైతులకు సూచనలు ఇచ్చారు. తమ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే ఈ జన్మభూమిని రైతు-మహిళ జన్మభూమిగా ఏర్పాటుచేశామన్నారు.

కరవుతో సతమతమవుతోన్న రైతులకు ఊరటనిచ్చేందుకే ఈ ఏడాది దాదాపు 500 కోట్లకు పైగా సహకార రుణాల వడ్డీని మాఫీ చేసినట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X