వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇది విద్రోహ చర్యే: దత్తాత్రేయ
న్యూఢిల్లీ: పాకాల రైలు ప్రమాదాన్ని రైల్వే శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ విద్రోహ చర్యగా అభివర్ణించారు. రైల్వే పట్టాలపై పెద్ద రాళ్ళబండలుండడం, ఫిష్ ప్లేట్లు తొలగించి ఉండడాన్ని బట్టి ఇది కచ్చితంగా విద్రోహుల చర్యగా అనుమానించాల్సి వస్తోందని ఆయన ఆదివారం న్యూఢిల్లీలో అన్నారు.
అధికారులు అందించిన సమాచారం ప్రకారం దాదాపు 13 రాళ్ళు పట్టాలపై అమర్చి ఉన్నాయి. ఇంజన్ వీటిని ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంపై ఆయనపై స్పందిస్తూ..విద్రోహ చర్యలు జరగకుండా..రైల్వే గస్తీ నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు తామ శాఖ చర్యలు తీసుకోనుందని చెప్పారు.
Comments
Story first published: Sunday, July 6, 2003, 23:53 [IST]