వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్ర ఫార్మూలాకు ముస్లింబోర్డు నో

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య అంశం మళ్ళీ మొదటికొచ్చింది. అయోధ్యపై కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేసిన రాజీ ప్రతిపాదనలను అఖిలభారత పర్సనల్‌ లా బోర్డు తిరస్కరించింది. 36 మంది సభ్యులతో కూడిన బోర్డు ఆదివారం సమావేశమై రెండు గంటలపాటు చర్చించింది.

జయేంద్ర ప్రతిపాదనలను బోర్డు నిర్ద్వందంగా తిరస్కరించింది. అయోధ్యపై జయేంద్ర సరస్వతి ప్రకటించినట్లు తను పంపిన ప్రతిపాదనల్లో ఎటువంటి ఫార్మూలా లేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమే ఉన్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం జయేంద్ర సరస్వతి వివాదాస్పద స్థలంపై కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి ఉండి, వివాదరహిత స్థలాన్ని దేవాలయ నిర్మాణం కోసం హిందువులకు అప్పగించాలని ప్రతిపాదన చేశారు.

ఇంతకుముందే అక్కడ తాత్కాలిక పూజామందిరం ఉన్నా తర్వాత కొత్తగా గుడి నిర్మాణం గురించి ప్రస్తావించి, మసీదు ప్రస్తావన తీసుకురాకపోవడమేంటని బోర్డు సభ్యులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X