వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదుపు కాని విషజ్వరం- మరిన్ని మరణాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అంతుచిక్కినవిషజ్వరం ఇంకా పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు 71 మంది మృత్యువాత పడినట్లు సమాచారం.

వరంగల్‌లో సోమవారం వరకు 9 మంది పిల్లలు మరణించగా మంగళవారం మరో ఎనమండుగురు మృతి చెందారు. ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల్లో మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కరీంనగర్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ జిల్లాలో మరణాల సంఖ్య 54కు చేరుకుంది. పక్క జిల్లాల నుంచివిషజ్వరం కోరల్లో చిక్కుకున్న పిల్లలు కరీంనగర్‌ ఆస్పత్రికి వస్తున్నారు. మంగళవారం ఐదుగురు మరణించారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యనిపుణులు కరీంనగర్‌లోనే ఉన్నారు. పూణేకు, ఢిల్లీకి పంపిన రక్త నమూనాల పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదు. ఈ ఫలితాలు ఒకటి రెండు రోజుల్లో రావచ్చునని అధికారవర్గాలు చెబుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X