వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జన్మభూమిపైవిద్యాసాగర్ అసంతృప్తి
కరీంనగర్: జన్మభూమి అమలు తీరుపై కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీసీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం కరీంనగర్లోవిలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జన్మభూమి కార్యక్రమం పింఛన్లను ఇవ్వడానికి, దరఖాస్తులుస్వీకరించడానికి, తదితర చిన్న చిన్న సమస్యలకు మాత్రమే పరిమితమైందని ఆయన అన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామసమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని బలపరిచినవారిలో తాను ముందున్నానని, అయితే దాని నిర్వహణతీరును మార్చాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. జన్మభూమిపై చర్చకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అది ఫలితాలు సాధించడానికి అన్ని పార్టీల సలహాలుస్వీకరించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునుకోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి బేషిజలాకు పోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Tuesday, July 8, 2003, 23:53 [IST]