వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బంగ్లాలో 600 మంది జలసమాధి?
ఢాకాః దక్షిణ బంగ్లాదేశ్ లోని భోలాజిల్లాలో నౌక మునిగి భారీగా ప్రాణనష్టంజరిగింది. డబుల్ డెకర్ పడవలో 750 మందిప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఇందులో 600మంది గల్లంతయ్యారని, వీరు మరణించిఉండవచ్చని సంబంధిత అధికారులుబుధవారం ఉదయం విలేకరులకు చెప్పారు.
మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈప్రమాదం వివరాలు కొన్ని గంటలు ఆలస్యంగా తెలిశాయి.బంగ్లాదేశ్ కు సమీపంలోని చాంద్ పూర్ పట్టణంవద్ద ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగాబంగ్లాదేశ్ లోని నదులు పొంగిపొర్లుతున్నాయని,ప్రయాణికులు, సరుకులతో ఓవర్ లోడ్ అయిన ఈనౌక మునిగిపోయిందని అధికారులు చెప్పారు. నౌక పై అంతస్తులోప్రయాణిస్తున్న 150 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారనివారు వివరించారు.
Comments
Story first published: Wednesday, July 9, 2003, 23:53 [IST]