70 లక్షల సమస్యల పరిష్కారం: బాబు
శ్రీకాకుళం: విషజ్వరాలను అదుపు చేయడానికి యుద్ధప్రాతిపదికపైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన బుధవారం నాడు ఉత్తరాంధ్రలో పలు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.విషజ్వరాలను నిరోధించడానికి పారిశుధ్యాన్ని పాటించాలని ఆయన ప్రజలకువిజ్ఞప్తి చేశారు. కలుషిత నీటి వల్ల విషజ్వరం సోకితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని ఆయన చెప్పారు.
జన్మభూమి కార్యక్రమాల్లో ఇప్పటి వరకు 70 లక్షల సమస్యలు పరిష్కరించామని ఆయనశ్రీకాకుళం జిల్లాలోని జన్మభూమి కార్యక్రమంలో చెప్పారు. లక్ష ఎకరాలకు సాగునీరందించే తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము ప్రజ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుంటే ప్రతిదీ ఉచితంగా ఇస్తామని కొంత మంది వాగ్దానాలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజల మేలు కోసం తాము చూపుతున్న శ్రద్ధ ఎవరూ చూపలేదని ఆయన అన్నారు. ఆధునిక సాగుపద్ధతుల ద్వారానే వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులుపెరుగుతాయని ఆయన చెప్పారు.