సంకీర్ణానికి రెడీః సోనియా
సివ్లూః మతవాద శక్తులనుఓడించేందుకు సెక్యులర్ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తమ పార్టీసిద్ధంగా ఉందని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీఅన్నారు. మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్నకాంగ్రెస్ మేధో మధన సదస్సు ముగింపుసమావేశంలో ఆమె ప్రధానమైన ఈ విధాన ప్రకటన చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం భావసారూప్యత గల సంకీర్ణ కూటమిలో చేరడానికి తమకు అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు.
250 మంది కాంగ్రెస్ ముఖ్యులుహాజరైన ముగింపు సదస్సులో ఆమె క్లుప్తంగా మాట్లాడారు. మతఛాందసవాదులతో పోరాటానికి వ్యూహం రూపొందించడానికిప్రయత్నాలను ముమ్మరం చేయవలసిందిగా ఆమెలౌకికవాదులను కోరారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిదాని మిత్రపక్షాలను చిత్తుగా ఓడించవలసిందిగా ఆమెపిలుపునిచ్చారు. అయోధ్యవిషయం ప్రస్తావిస్తూ ఆమె తమ పార్టీ వైఖరి, స్పష్టంగా స్ధిరంగాఉందని, ఈ సమస్యను కోర్టు ద్వారానేపరిష్కరించుకోవాలని, కోర్టు తీర్పును అన్ని పార్టీలుశిరసావహించాలని సోనియా గాంధీ అన్నారు.