స్వార్థరాజకీయాలే ప్రతిబంధకాలు: బాబు
హైదరాబాద్: కొన్ని పార్టీలుస్వార్థరాజకీయాలతో అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిమర్శించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. సివ్లూ కాంగ్రెస్ మేధోమథన సదస్సులో ఉచితవిద్యుత్ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు.
జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను కంప్యూటీకరించి ప్రాధాన్యతా క్రమంపై వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపైనే జన్మభూమిలో ఆర్జీలుఅందాయని ఆయన చెప్పారు. అక్కడక్కడా కాంగ్రెస్, నక్సల్స్ నుంచి ఆటంకాలు ఎదురు కావడం తప్ప జన్మభూమి కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందని ఆయన చెప్పారు. మూడు నెలల్లో ప్రజలకు కొత్త రేషన్కార్డులు ఇస్తామని ఆయన చెప్పారు.
ప్రజల్లో అంటువ్యాధులపై అవగాహన కలిగించేందుకు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఐదు రోజుల పాటు ఐదు రకాల కార్యక్రమాలు తీసుకుంటామని,వీటిలో అన్ని ప్రభుత్వ శాఖలను, డ్వాక్రా వంటి సంఘాలను భాగస్వాములను చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు వేల రూపాయలేసి వెంటనే విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.