వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు కోడెల వరంగల్‌ పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: విషజ్వరాలు సోకి పిల్లలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు శనివారం వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించారు.విషజ్వరాలు వ్యాపించిన వరంగల్‌ జిల్లాలో కోడెల శివప్రసాదరావు పర్యటించి ఉండే బాగుండేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడిన నేపథ్యంలో ఆయన ఈ పర్యటన చేసినట్లు కనపబడుతోంది.

ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను ఆయన పరిశీలించారు. పిల్లల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించారు. వ్యాధి నయం కాకుండా పిల్లలను డిశ్చార్జి చేయవద్దని ఆయన వైద్యులకు సూచించారు. పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X