వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎట్టకేలకు కోడెల వరంగల్ పర్యటన
వరంగల్: విషజ్వరాలు సోకి పిల్లలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు శనివారం వరంగల్లోని ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించారు.విషజ్వరాలు వ్యాపించిన వరంగల్ జిల్లాలో కోడెల శివప్రసాదరావు పర్యటించి ఉండే బాగుండేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడిన నేపథ్యంలో ఆయన ఈ పర్యటన చేసినట్లు కనపబడుతోంది.
ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను ఆయన పరిశీలించారు. పిల్లల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించారు. వ్యాధి నయం కాకుండా పిల్లలను డిశ్చార్జి చేయవద్దని ఆయన వైద్యులకు సూచించారు. పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
Comments
Story first published: Saturday, July 12, 2003, 23:53 [IST]