సోనియాకు అంతా చెప్పా: ఎమ్మెస్
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాష్ట్ర రాజకీయాల గురించి పూర్తి, సమగ్ర సమాచారాన్నిఅందించినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీ వెళ్ళి వచ్చిన ఎమ్మెస్- తమ అధ్యక్షురాలికి ఇక్కడి వర్గరాజకీయాలు, క్రమశిక్షణ రాహిత్యం గురించి నిర్మోహమాటంగా చెప్పినట్లు చెప్పారు.
శనివారం ఆయన పీసీసీ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మీడియాసెల్ ను ప్రారంభించిన అనంతరం కాసేపు విలేకరులతో మాట్లాడారు. తనకు మరిన్నిఅధికారాలు ఇస్తే రాష్ట్ర నాయకుల్లో క్రమశిక్షణనుపెంపొందిస్తానని ఆమకు తెలియచేసినట్లు చెప్పారు.ఉన్నదున్నట్లు చెప్పాను. ఇక ఆమె ఇష్టం అని ఆయనపేర్కొన్నారు. త్వరలో ఇక్కడి నాయకులతో సోనియా చర్చలు జరుపుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.పీసీసీ అధ్యక్ష పదవి, తెలంగాణ డిమాండు వంటిఅంశాల గురించి కూడా ఎమ్మెస్ సోనియాగాంధీతో ప్రత్యేకంగా చర్చించారు.