వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుష్కరాలకై స్పెషల్ కాల్ సెంటర్లు
ఏలూరు: గోదావరి పుష్కరాలను పురష్కరించుకొని ప్రత్యేకంగా కాల్సెంటర్లను ఏర్పాటు చేయాలని బీఎస్ ఎన్ ఎల్ఆలోచిస్తోంది. అన్ని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ లలో భక్తులు,సందర్శకుల సౌకర్యార్థం సమాచారన్ని అందించే ఈ కాల్సెంటర్ల ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవాలనిబీఎస్ ఎన్ ఎల్ భావిస్తోంది.
ఈ మేరకుఉన్నతాధికార్లకు ఓ ప్రతిపాదన పంపినట్లుబీఎస్ ఎన్ ఎల్ పశ్చిమగోదావరి ఏరియా మేనేజర్ఎల్.అనంతరాం విలేకరులకు తెలిపారు. పుష్కరాలసందర్భంగా తాము ప్రజలకు సేవ చేయాలన్నదే దీనిఉద్దేశమని ఆయన అన్నారు. త్వరలోనే తమకేంద్ర కార్యాలయం దీనికి అనుమతి ఇస్తుందనిఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు,రాజమండ్రిలోని పుష్కరాల స్నానాల ఘట్టాల వద్ద ఇంకానిర్మాణపు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధిపనులపై జాప్యంపై రాజమండ్రి పురపాలకసంఘంలో నిత్యం ఆందోళనలు జరుగుతున్నాయి.
Comments
Story first published: Saturday, July 12, 2003, 23:53 [IST]