సంకుచిత హిందుత్వకు నో: అద్వానీ
(ప్రత్యేక విమానంలో..): విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు ప్రతిపాదించే సంకుచిత హిందూత్వ తమ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని ఉపప్రధాని ఎల్.కె.అద్వానీ స్పష్టం చేశారు. ముస్లిం వ్యతిరేక ముద్ర పరిపాలనా సామార్థ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అయితే, ఆయోధ్యపైఆరెస్సెస్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీ గురించి వ్యాఖ్యానించేందుకు అద్వానీ నిరాకరించారు.
నాగ్ పూర్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం ఆయన ప్రత్యేకవిమానంలో ప్రయాణిస్తూ కాసేపు విలేకరులతో మాట్లాడారు.విశ్వహిందూపరిషత్ సిద్దాంతాల పట్ల తమకున్న నిబద్దతను గుర్తించాలని ఆయనకోరారు. అయితే, అదే సమయంలో కాలంతో పాటు మారుతున్న పరిణామాలను సైతం గ్రహించాలన్నారు.
మారిన పరిస్థితులతో మేమూ పయనిస్తున్నాం. మా ఎజెండాను మాత్రం వీడలేదు. ఈవిషయాన్ని మా సహచరసంస్థలు గుర్తిస్తాయానే భావిస్తున్నాని ఉపప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ఒక్క మతానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎన్డీఎ సర్కార్ వ్యవహరించబోదన్నారు.
ఎవరూ మనల్ని శత్రువులుగా చూడకూడదు. ముస్లిం వ్యతిరేక ముద్ర మన దేశ పాలనాసామార్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.