వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాసరను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్రానికేవిద్యాకేంద్రంగా అభివృద్ది పరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాంతంలో ఐఐటీ ఏర్పాటుకు సైతం కేంద్రంపై తమ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించిందన్నారు. ఆదివారం ఆయన బాసరలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్సెంటర్ ను ప్రారంభించారు.
ధ్యానమందిరం శంకుస్థాపన చేశారు. మొత్తం నాలుగు కోట్ల రూపాయల వ్యయం అయ్యే వివిధవిద్యా, ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ ల శంకుస్థాపన చేశారు. బాసరనువిద్యా, అధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రం నుంచి ఏటా ఐఐటీలకు ఎంపికయ్యేవిద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఈ దిశగా ప్రముఖవిద్యావేత్త చుక్కా రామయ్య చేస్తోన్న కృషిని ఆయన కొనియాడారు.
Comments
Story first published: Sunday, July 13, 2003, 23:53 [IST]