వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణాలో ఇంకా వణికిస్తోన్న వ్యాధులు
వరంగల్: ఉత్తర తెలంగాణాఅంతా అంతుచిక్కని వ్యాధులతో వణికిపోతోంది. ఆదివారం నాటికి అంతుచిక్కని వ్యాధి కారణంగా 97 మంది పిల్లలు చనిపోయారు. ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని విస్తృతంగా వైద్య బృందాలు, జాగ్రత్త చర్యలు చేపట్టినా పరిస్థితిఅదుపులోకి రాలేదు. వరంగల్, కరీంనగర్ లలో పిల్లలు అధికంగా ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు.
ప్రభుత్వాసుపత్రిలన్నీ పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ వ్యాధి నివారణలో పాలుపంచుకోవాలని పిలుపు ఇచ్చినప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రిలు ముందుకు రావడంలేదు.
ఈ తరహా వ్యాధి లక్షణాలున్న పిల్లలను వారు తమ ఆసుపత్రిల్లో అడ్మిట్ చేసుకోవడం లేదు. వ్యాధి ఏమిటో ఖచ్చితంగా తెలియకపోవడంతో పాటు, చావు పిల్లలను బలిగొంటున్నందున ప్రైవేట్ ఆసుపత్రులు వెనుకంజ వేస్తున్నాయి.
Comments
Story first published: Sunday, July 13, 2003, 23:53 [IST]