వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాధి విస్తరణను అడ్డుకుంటాం: కోడెల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇతర జిల్లాలకువిషజ్వరాలు పాకకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఈవిషయంలో వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దోమల నివారణకు, పారిశుధ్య కల్పనకు సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకుగాను ప్రతి మైనర్‌ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ఐదేసి వేల రూపాలయలు విడుదల చేసింది. వైద్య, ఆరోగ్య, తదితర ప్రభుత్వ శాఖలతో పాటు డ్వాక్రా,సిఎంఇవై వంటి సంఘాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయని మంత్రి చెప్పారు. దోమకాటు వల్లనే పిల్లలకువిషజ్వరాలు పాకుతున్నాయని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది.

వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శివప్రసాదరావు తెలిపారు. శాంతాబయోటెక్‌ వ్యాక్సిన్‌అందించడానికి ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.విషజ్వరాలు కేసులు ఇప్పటి వరకు 190 నమోదుకాగా, 103 మంది పిల్లలు మరణించినట్లు ఆయన తెలిపారు. వ్యాధి నివారణవిషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శను ఆయన ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X