ఎంసిసి దుశ్చర్యతో పట్టాలు తప్పిన రైళ్లు
పాట్నా: నక్సలైట్లు ట్రాక్ను ధ్వంసం చేయడంతో బీహార్లో మూడురైళ్లు పట్టాలు తప్పాయి. నిషిద్ధ మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్ (ఎంసిసి) కార్యకర్తలు పెద్ద యెత్తున రైల్వే ట్రాక్స్ను ధ్వంసం చేశారు. మంగళవారం తలపెట్టిన తిర్హుత్-మిథిలాంచల్ బంద్ సందర్భంగా వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
సమస్తిపూర్ డివిజన్లోని భైరోగంజ్- ఖర్పోఖ్రాసెక్షన్ మధ్య ఎంసిసి కార్యకర్తలు 90 మీటర్ల రైల్వే ట్రాక్నుపేల్చేశారు. ఒక మీటర్ ట్రాక్ను ధ్వంసం చేశారు. దీంతో సోమవారం రాత్రి ముజఫర్పూర్- గోరఖ్పూర్ ప్యాసెంజర్రైలు పట్టాలు తప్పింది. అయితే ప్రాణనష్టం ఏదీ జరగలేదని సమాచారం. అదే డివిజన్లో ముజఫర్పూర్, సుగౌలిల మధ్య గల పిప్రాస్టేషన్ సమీపంలో 70 మీటర్ల ట్రాక్ను పేల్చేశారు. సిగ్నల్స్ను, పాయింట్స్ను ధ్వంసం చేశారు.
మరో చోట ఫిష్ ప్లేట్లను తొలగించడంతో దర్భంగ- నర్కాటియాగంజ్ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఇక్కడ కూడా ప్రాణ నష్టమేదీ జరగలేదు. సమస్తిపూర్ సమీపంలోని రామభద్రాపూర్ వద్ద ట్రాక్ను నక్సలైట్లు ట్రాక్ను ధ్వంసం చేయడంతో కుర్లా- దర్భంగఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ సంఘటనలతో ముజఫర్పూర్- గోరఖ్పూర్ల మధ్యరైల్వే సర్వీసుల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది. పలురైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ట్రాక్ను ధ్వంసం చేసిన ఎంసిసి నక్సలైట్లు కరపత్రాలను వదలి వెళ్లారని వారు చెప్పారు.