రాజీనామాపై పట్టు వీడని నితీష్
న్యూఢిల్లీ: తన రాజీనామాను వెనక్కి తీసుకోవడానికిరైల్వే మంత్రి నితీష్కుమార్ నిరాకరించారు. తానురైల్ భవన్లోని తన కార్యాలయానికి రాబోనని ఆయన మంగళవారం చెప్పారు.
సమతా పార్టీలోని అంతర్గత విభేదాలు నితీష్కుమార్ రాజీనామాకు దారితీశాయి. ఆయన తన రాజీనామా లేఖను సోమవారం ప్రధాని అటల్బిహారీ వాజ్పేయికి సమర్పించారు. అయితే ఆయన రాజీనామాను సోమవారంనాడే ప్రధాని తిరస్కరించారు.
అంతకు ముందు సమతా పార్టీ జాతీయ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే తాను రాజీనామా చేస్తున్నవిషయాన్ని నితీష్కుమార్ ప్రకటించారు. తాను పార్టీలోని కొందరు నాయకులు చేస్తున్నవిమర్శలతో విసిగిపోయానని, తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని, రాజకీయాల్లో కొనసాగడం ఇష్టం లేదని ఆయన అన్నారు. అయితే సమతా పార్టీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ నితీష్ రాజీనామాను తిరస్కరించారు.అయినా తన రాజీనామా విషయంలో నితీష్కుమార్ తన పట్టు వీడడం లేదు.