వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరుకు నీరు వదలాలి: ఎమ్మెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డియస్‌) నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాకు నీరు వదలాలనేది తన వైఖరి అని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆర్‌డియస్‌ నీటి విషయంలో కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతుల మధ్య తలెత్తినవివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ చాలా వెనుకబడిన జిల్లా అని,అందువల్ల ఆ జిల్లాకు రావాల్సిన నీటిని వదలాల్సి వుంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించుకుంటు పోతున్న వైనంపై మన ప్రభుత్వం పట్టించుకోలేదని, అధికారులు నివేదికలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు.

ఆర్‌డియస్‌ నీటి విషయంలో సీనియర్‌ మంత్రుల్లోనూ అభిప్రాయభేదాలు పొడసూపాయి. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి బి.వి.మోహన్‌రెడ్డికి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నాగం జనార్దన్‌ రెడ్డికి మధ్య సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సమక్షంలోనే వాగ్వివాదం నడిచినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినసీనియర్‌ మంత్రుల సమావేశంలో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలువ్యక్తమయ్యాయని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X