వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డ్వాక్రాగ్రూప్ లకు 1000 కోట్ల రుణాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న డ్వాక్రాగ్రూప్ లకు బ్యాంకుల ద్వారా ఈ ఏడాది దాదాపువెయ్యి కోట్ల రూపాయల రుణాలను అందచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశంలో ఉన్న డ్వాక్రా గ్రూప్ లలో సగానికిపైగా రాష్ట్రంలోనే ఉన్నాయని, వీటి ప్రగతి అబ్బురపరిచే విధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బి.గోపాలకృష్ణరెడ్డి ఈవివరాలను విలేకరులకు తెలిపారు.
అయితే, రుణాలపై వడ్డీని తగ్గించేవిషయాన్ని మాత్రం ప్రభుత్వం ప్రకటించలేదు. మరో వైపు సన్నకారు రైతులకు ఉపయోగపడేలా కేంద్రప్రభుత్వం సహకార రుణాలపై వడ్డీని సగానికిపైగా తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 16-18 శాతం రుణాలను 9 శాతానికి కుదించింది.
Comments
Story first published: Wednesday, July 16, 2003, 23:53 [IST]