జార్జి బుజ్జగించినా దిగిరాని నితీష్
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి నితీష్కుమార్ను బుజ్జగించడానికి సమతా పార్టీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చేసిన ప్రయత్నాలన్నీవిఫలమయ్యాయి. కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని ఫెర్నాండెజ్ చేసినవిజ్ఞప్తిని నితీష్కుమార్ త్రోసిపుచ్చారు.
నితీష్కుమార్ను ఆయన నివాసంలో ఫెర్నాండెజ్ కలుసుకున్నారు. వారిరువురు బుధవారం ఉదయం దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. తాను తీసుకున్న నిర్ణయంలో మార్పేమీ లేదని, తాను కార్యాలయం విధులకుహాజరు కాబోనని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.రైల్ భవన్కు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు.
నితీష్కుమార్తో ఫోన్లో మాట్లాడడంతో ఫలితం లేకపోవడంతో ఫెర్నాండెజ్ నేరుగా ఆయన ఇంటికే వెళ్లారు. సమతా పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలతో నితీష్కుమార్ ఈ నెల 14వ తేదీన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.