వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామోజీరావుకు లోకమాన్య అవార్డు
పూణ: ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ అవార్డు ఈ ఏడాదికి గాను ఈనాడు ప్రధాన సంపాదకుడు సిఎచ్.రామోజీరావుకు దక్కింది. బాలగంగాధర్ తిలక్పేరిట లోకమాన్య తిలక్ ట్రస్ట్ ఏటా ప్రదానం చేసే ఈ అవార్డును 2003 సంవత్సరానికి గాను రామోజీరావుకుఅందచేయనున్నట్లు ఆ ట్రస్ట్ ప్రకటించింది. ఆగస్ట్ 1న పూణలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయనకు ప్రదానం చేస్తారు.
మీడియారంగంలో రామోజీరావు కృషిని ఆ సంస్థ కొనియాడింది. ఇందిరాగాంధీ, మన్ మోహన్సింగ్, వాజ్ పేయి, ఎం.ఎస్.స్వామినాథన్ వంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డునుస్వీకరించిన వారిలో ఉన్నారు. అవార్డు కింద లక్షరూపాయల నగదు, ప్రశంసపత్రం, బంగారు పతకంఅందచేస్తారు. జాతి ప్రయోజనాల కోసం విశేషంగా కృషిచేసిన వ్యక్తులకుఅందచేసే ఈ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి రామోజీరావు కావడంవిశేషం.
Comments
Story first published: Wednesday, July 16, 2003, 23:53 [IST]