వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావుకు లోకమాన్య అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

పూణ: ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్‌ అవార్డు ఈ ఏడాదికి గాను ఈనాడు ప్రధాన సంపాదకుడు సిఎచ్‌.రామోజీరావుకు దక్కింది. బాలగంగాధర్‌ తిలక్‌పేరిట లోకమాన్య తిలక్‌ ట్రస్ట్‌ ఏటా ప్రదానం చేసే ఈ అవార్డును 2003 సంవత్సరానికి గాను రామోజీరావుకుఅందచేయనున్నట్లు ఆ ట్రస్ట్‌ ప్రకటించింది. ఆగస్ట్‌ 1న పూణలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయనకు ప్రదానం చేస్తారు.

మీడియారంగంలో రామోజీరావు కృషిని ఆ సంస్థ కొనియాడింది. ఇందిరాగాంధీ, మన్‌ మోహన్‌సింగ్‌, వాజ్‌ పేయి, ఎం.ఎస్‌.స్వామినాథన్‌ వంటి ప్రముఖులు గతంలో ఈ అవార్డునుస్వీకరించిన వారిలో ఉన్నారు. అవార్డు కింద లక్షరూపాయల నగదు, ప్రశంసపత్రం, బంగారు పతకంఅందచేస్తారు. జాతి ప్రయోజనాల కోసం విశేషంగా కృషిచేసిన వ్యక్తులకుఅందచేసే ఈ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి రామోజీరావు కావడంవిశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X