వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాజ్ పై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ఆగ్రాలోని వివాదాస్పదతాజ్ హెరిటేజ్ కారిడర్ నిర్మాణపు పనుల్లో తలెత్తిన అవకతవకలపై సమగ్రంగాదర్యాప్తు సాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎనిమిది వారాల్లోగా నివేదికను సమర్పించాలనిబుధవారం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
సాంస్కృతిక కట్టడమైనతాజ్ మహల్ భవనానికి భంగం కలిగేలాఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందనిజస్టిస్ ఎం.బి.షా, జస్టిస్ ఏ.ఆర్.లక్ష్మణన్ లతో కూడినడివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్ట్ కుకేంద్రం నుంచి గానీ, పర్యావరణ శాఖ నుంచి గానీ అనుమతిలభించలేదన్న విషయాన్ని బెంచ్ పరిగణనలోకి తీసుకొంది.అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్నిర్మాణంపై దర్యాప్తు జరిపించాలని నిర్ణయానికొచ్చినట్లు బెంచ్పేర్కొంది.
Comments
Story first published: Wednesday, July 16, 2003, 23:53 [IST]