ఆరుణ, రావులలను పరామర్శించిన జైపాల్
మహబూబ్నగర్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డియస్) తూములు మూయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నేత డి.కె.అరుణను కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు ఎస్. జైపాల్ రెడ్డి పరామర్శించారు. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డిని కూడా ఆయన పరామర్శించారు.
మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రావుల రవీంద్రనాథ్ రెడ్డిని బుధవారం తెల్లవారుజామున పోలీసులుఅరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనేఅరుణ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రవీంద్రనాథ్ రెడ్డిఅరెస్టుతో ఆగ్రహించిన టిఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ను ముట్టడించారు. తూములను మూసేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) కూడా ఆందోళనకుశ్రీకారం చుట్టింది.
బుధవారంనాడు బిజెపి కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. బిజెపి పార్లమెంటు సభ్యుడుఎ.పి. జితేందర్ రెడ్డి ఈ నెల 20వ తేదీ నుంచి ఆలంపూర్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అదే రోజు నుంచి ఆరు రోజుల పాటు టిఆర్ఎస్ అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు ఆర్డియస్ పరీవాహక ప్రాంతాల్లో పాదయాత్ర ప్రారంభిస్తారు.