వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు ఎమ్మెస్సార్‌ బేషరతు క్షమాపణలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు హైకోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర మంత్రి రామసుబ్బారెడ్డి నిందితుడైన జంట హత్య కేసులో చేసిన వ్యాఖ్యకు గాను ఆయనపై కోర్టు ధిక్కారం దావా దాఖలయింది.

సత్యనారాయణరావు గురువారంస్వయంగా కోర్టుకు హాజరై క్షమాపణ చెప్పారు. ఈ కేసులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును వాయిదా వేసింది. రామసుబ్బారెడ్డి నిందితుడైన జంట హత్యల కేసును మహబూబ్‌నగర్‌ కోర్టు నుంచి హైదరాబాద్‌సెషన్స్‌ కోర్టుకు మార్చడాన్ని తప్పు పడుతూ సత్యనారాయణ రావు ప్రకటన చేసినట్లు నిరుడుసెప్టెంబర్‌లో వార్తలు వచ్చాయి. అయితే తాను అలా అనలేదని, పత్రికలు తప్పుగా రాశాయని సత్యనారాయణరావువివరణ ఇచ్చుకున్నారు.

అయినా కోర్టు తనకు సమన్లు జారీ చేసిందని, దాంతో తాను కోర్టుకుహాజరై క్షమాపణలు చెప్పానని ఆయన చెప్పారు. ఆరోపణలు వచ్చిన వెంటనే తెలంగాణలోని మంత్రుల చేత రాజీనామాలు చేయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రామసుబ్బారెడ్డి చేత ఎందుకు చేయించడం లేదని తాను ప్రశ్నించానని సత్యనారాయణ రావు గురువారంవిలేరులతో చెప్పారు. ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్యవివక్షను చూపడమేనని తాను వ్యాఖ్యానించినట్లు కూడా ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X