వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంక్షోభం ముగిసినట్లే: ఫెర్నాండెజ్
న్యూఢిల్లీ: తమ పార్టీలో తలెత్తినసంక్షోభం ముగిసినట్లేనని సమతా పార్టీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ప్రకటించారు. ప్రతి సమస్యా పరిష్కారమైనట్లేనని ఆయన గురువారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
పార్టీ పార్లమెంటు సభ్యుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలురైల్వే మంత్రి నితీష్కుమార్ రాజీనామాకు దారి తీసినవిషయం తెలిసిందే. రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రకటించిన నితీష్కుమార్ గురువారం సాయంత్రం దిగి వచ్చారు. తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆయన గురువారంనాడురైల్ భవన్కు చేరుకుని తన విధులకుహాజరయ్యారు. ప్రతి పార్టీలో గొడవలు మామూలేనని, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని ఫెర్నాండెజ్ అన్నారు.
Comments
Story first published: Thursday, July 17, 2003, 23:53 [IST]