వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభం
రాయ్ పూర్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం ఉదయం రాయ్ పూర్ లో ప్రారంభం అయ్యాయి. అయోధ్యఅంశంపై పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయితో ప్రధాన నాయకులు అంతా ఈ సమావేశాలకుహాజరయ్యారు.
అయితే, అయోధ్యపై అటు సంఘ్ పరివార్ వర్గాలను సంతృప్తి పరుస్తూనే, ఇటు ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, కార్యవర్గం సమావేశాల అనంతరం చేసే తీర్మానంలో అయోధ్యపై చట్టం చేసే ప్రతిపాదన ఉండకపోవచ్చు. మరోవైపు, రాయ్ పూర్ లో ప్రధాని వాజ్పేయి విలేకరులతో మాట్లాడుతూ..తాను వివాదాల్లో దూరేందుకు సిద్దంగా లేనని చెప్పారు. రామమందిరంపై చర్చ కొనసాగుతోంది...వివాదాల్లోకి లాగొద్దు ...అని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, July 18, 2003, 23:53 [IST]