వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దీక్షపై వెనక్కి తగ్గిన జితేందర్ రెడ్డి
హైదరాబాద్: ఈ నెల 20వ తేదీ నుంచి మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో తలపెట్టిన తనఆమరణ నిరాహారదీక్షను భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యుడుఎ.పి. జితేందర్ రెడ్డి ఉపసంహరించుకున్నారు.
రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డియస్) తూములను మూసేసి మహబూబ్నగర్ జిల్లా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జితేందర్ రెడ్డి ప్రకటించినవిషయం తెలిసిందే. బిజెపి శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఇతర బిజెపి నేతలతో కలిసి జితేందర్ రెడ్డి శుక్రవారం హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్తో మాట్లాడారు. ఈ చర్చల అనంతరం నిరాహారదీక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జితేందర్ రెడ్డి ఉపసంహరించుకున్నారు.
Comments
Story first published: Friday, July 18, 2003, 23:53 [IST]