అయోధ్య ప్రచారాస్త్రం కాదు: వెంకయ్య
రాయపూర్: రామాలయ నిర్మాణం ఎన్నికలఅంశం కాదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. లౌకికవాదంపై చర్చకు రావాలని ఆయన కాంగ్రెస్కు సవాల్విసిరారు. పార్టీ మూడు రోజుల కార్యవర్గ సమావేశంలో మొదటి రోజు శుక్రవారం ప్రారంభోపన్యాసం చేశారు. సాఫ్ట్ హిందూత్వ కార్డు వాడాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
హిందూత్వ భారతదేశం ఆత్మ అని,అందుకు మనం గర్విస్తున్నామని, కానీ అది ఎన్నికలఅంశం కాబోదని, హిందూత్వను సంకుచిత దృక్పథంగా చూపడంసరైంది కాదని ఆయన అన్నారు. తాము సెక్యురిలజానికి కట్టుబడి ఉన్నామని, అయితే బూటకపు లౌకికవాదానికి, మైనారిటీలను బుజ్జగించే ప్రయత్నాలకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
అయోధ్యపై ఈ సమావేశం తన విధానాన్ని ప్రకటించి ఒక తీర్మానం చేస్తుంది. ఈ సమావేశానికి ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి, ఉపప్రధాని ఎల్.కె. అద్వానీలతో పాటు 150 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.బిజెపి లౌకిక వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు చేస్తున్నవిమర్శకు తాము ఆందోళన చెందడం లేదని, లౌకికవాదంపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని వెంకయ్యనాయుడు అన్నారు.