వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అద్వానీపై అభియోగాల ఉపసంహరణ
లక్నో: అయోధ్య కట్టడం కూల్చివేత కేసులో ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి మురళీ మనోహర్ జోషీ, ఇతర బిజెపి నేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను కేంద్ర దర్యాప్తు బృందం(సిబిఐ) ఉపసంహరించుకుంది.
రాయబరేలీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ నేరారోపణలను ఉపసంహరించుకున్నట్లు నిందితుల తరఫు న్యాయవాది ఒకరు శనివారం చెప్పారు. ఎనమండుగురు నిందితులపై నేరారోపణలకు ఏ విధమైన ఆధారాలు దొరకనందున వారిపై అభియోగాలను ఉపసంహరించుకున్నట్లు నిందితుల తరఫు న్యాయవాదుల్లోఒకరైన మృదుల్ రాకేశ్ చెప్పారు. ఈ ఉపసంహరణ రాజకీయంగా దుమారం రేపే అవకాశాలున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Story first published: Saturday, July 19, 2003, 23:53 [IST]