వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగర్‌ ఆయకట్టుపై టిఆర్‌ఎస్‌ ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డియస్‌)పై ఆందోళన చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ఆయకట్టుపై కూడా దృష్టిపెట్టింది. సాగర్‌ ఆయకట్టుకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన కార్యక్రమాలను టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడుకె. చంద్రశేఖర్‌ రావు శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఈ నెల 30వ తేదీన నల్లగొండ జిల్లా బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. దానికి ముందు ఈ నెల 28వ తేదీన రాస్తారోకో, 29వ తేదీన పాఠశాలల తరగతుల బహిష్కరణ జరుగుతాయని ఆయన చెప్పారు. ఆర్‌డియస్‌పై తన పాదయాత్ర ఆదివారం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఆర్‌డియస్‌ పరీవాహక ప్రాంతంలోని 143 కిలోమీటర్లు తన పాదయాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. ఆర్‌డియస్‌ తూములు మూసేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X