సుపరిపాలన ప్రచారాస్త్రం: బిజెపి
రాయ్పూర్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో జాతీయ ఏకత, భద్రత, సుపరిపాలన, అభివృద్ధి తమ ప్రచారాస్త్రాలని బారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆదివారంనాడు ప్రకటించింది. అయితే రామాలయ నిర్మాణం వంటి తమ సైద్ధాంతికఅంశాలను వదులుకోబోమని స్పష్టం చేసింది.
మూడు రోజలు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం బిజెపి అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడారు. బిజెపికి వ్యతిరేకంగా లౌకిక సంకీర్ణానికి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును ఆయన ఎద్దేవా చేశారు. అదింకా ప్రారంభమే కాలేదని, అది మొదలే కాదని,ఫలితం ఇవ్వదని ఆయన అన్నారు.
వచ్చే ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోరాడుతుందని,మిజోరంలో మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో తమ పార్టీవిజయం సాధిస్తుందని ఆయన అన్నారు. రామాలయ నిర్మాణంపై, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కార్యవర్గంలో చేసిన తీర్మానాలు పార్టీ ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.