వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైభవంగా లష్కర్ బోనాలు
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో, పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన లష్కర్ బోనాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసంలో తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ఈ ఉత్సవంపెద్ద యెత్తున ప్రారంభమైంది.
వేలాది మంది భక్తులు అమ్మవారి సందర్శించి, బోనాలు సమర్పించుకున్నారు. కళాబృందాలు సాంస్కృతి ప్రదర్శనలు ఇచ్చాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించి,అర్చనలు చేశారు. అమ్మవారి దయతో రాష్ట్రంలో వర్షాలు పడాలని, శాంతిభద్రతలు బాగుండాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
Comments
Story first published: Sunday, July 20, 2003, 23:53 [IST]