వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ హతం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మరణించారు.
నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు, చిట్యాల ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా నలుగురు నక్సల్స్ ఎదురు పడ్డారు. ఈ సమయంలో ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించాడు.మిగతా వారి కోసం పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో శనివారంనాడు మరో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. మరణించిన నక్సలైట్లు నిషిద్ధపీపుల్స్వార్ బెల్లంకొండ దళసభ్యులని పోలీసులు చెబుతున్నారు.
Comments
Story first published: Sunday, July 20, 2003, 23:53 [IST]