వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
610 జీవో అమలుపై ప్రత్యేక సెల్!
హైదరబాద్: 610 జీవో అమలుపై శాసనసభ సంఘం సమర్పించిన మధ్యంతర నివేదిక అమలుపై ప్రత్యేకసెల్ ను ఒకటి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం దీనిపై చర్చలు జరిపింది.
తెలంగాణలో స్థానికేతరులను తొలగించి స్థానికులను మాత్రమే ఆ స్థానాల్లో భర్తీ చేయాలన్నవిషయంపై ప్రభుత్వం సమగ్రం చర్చ జరిపింది. అయితే, దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఏవిషయమూ ప్రకటించలేదు. తక్షణ పరిష్కారంగా దీనిపై ప్రత్యేకసెల్ ను ఏర్పాటు చేయాలన్న భావనలో ప్రభుత్వం ఉంది.
అలాగే ఆర్డీఎస్ నీటి వివాదంపై మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా రైతులను శాంతపర్చేలా చర్యలు తీసుకునేఅంశంతో పాటు పలు ఇతర అంశాలపై క్యాబినెట్ చర్చ జరిపింది.
Story first published: Monday, July 21, 2003, 23:53 [IST]