వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణ ఆమరణ నిరశన దీక్ష భగ్నం

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డియస్‌) తూములను మూసేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు డి.కె.అరుణ చేపట్టిన ఆమరణ నిరాహా దీక్షను పోలీసు భగ్నం చేశారు. ఆమెను సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల సలహా మేరకేఅరుణను ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. ఆమె దీక్ష ఐదు రోజుల పాటు సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్‌ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను ముందు పోలీసులు భగ్నం చేశారు. ఆయనను ఆస్పత్రిలో చేర్చిన వెంటనేఅరుణ తన నిరాహార దీక్ష ప్రారంభించారు. అరుణ దీక్షకు మహిళా కాంగ్రెస్‌ పూర్తి మద్దతు ప్రకటించింది.

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేపట్టిన పాదయాత్ర సోమవారం రెండో రోజుకు చేరుకుంది. ఆయనతో పాటు శాసనసభ్యుడు రావుల రవీంద్రనాథ్‌ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X