వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్పై నిషేధం ఏడాది పొడగింపు
హైదరాబాద్: పీపుల్స్ వార్ పై మరో ఏడాది పాటు ప్రభుత్వం నిషేధాన్ని పొడగించింది. మంగళవారంతో నిషేధం గడువు ముగియనుండడంతో సోమవారం సమావేశమైన మంత్రివర్గం వార్ పై ఏడాది పాటు నిషేధాన్ని పొడగించింది. క్యాబినెట్ తీసుకొన్న పలునిర్ణయాలను సమాచార శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డివిలేకరులకు తెలిపారు.
అలాగే, ఇంజనీరింగ్ విద్య ఫీజుపెంపు విషయంలో సుప్రీం కోర్టుకు నివేదించామని చెప్పారు. ఇంజనీరింగ్ఫీజు తగ్గించే వెసులు బాటు ఉందా లేదా తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను సంప్రతించిందని, ఒక వేళ సుప్రీంఅందుకు అనుమతిస్తే ప్రభుత్వం ఫీజును తగ్గిస్తుందని ఆయన చెప్పారు. పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు పుష్కర స్నానాలు చేయవచ్చని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, July 21, 2003, 23:53 [IST]