వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేసీఆర్ పాదయాత్రకు స్పందన
హైదరాబాద్: రాజోలిబండమల్లింపు పథకం ప్రాజెక్ట్ గేట్లు మూసివేసిమహబూబ్ నగర్ ప్రాంత రైతులకు నీరు అందించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రసమితి నేతకె.చంద్రశేఖర్ రావు చేపట్టిన పాదయత్రకుమంచి స్పందన వ్యక్తమవుతోంది.
సోమవారం 20 కిలోమీటర్లకుపైగా నడిచిన చంద్రశేఖర్ రావుకు దారివెంటా ప్రజలుఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించేంతవరకుతాము ఉద్యమిస్తామని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు అన్నారు. రాయలసీమ ప్రజలకు లబ్ది చేకూరేలా, రాజోలిబండ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతులు నీళ్ళు లేక అలమటిస్తోంటే చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన ఆరోపించారు. నీరు అందించడమే ఒక్కటే పరిష్కారమన్నారు.
Story first published: Monday, July 21, 2003, 23:53 [IST]