వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిబిఐ పాత్రపై పార్లమెంటులో రభస
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే ప్రతిపక్షాల ఆరోపణలతో సోమవారం పార్లమెంటు ఉభయ సభలు దద్ధరిల్లాయి. ప్రతిపక్షాల నాయకులను వేధించడానికి ప్రభుత్వం సిబిఐని వాడుకుంటోందని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) ధ్వజమెత్తాయి.
ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టడానికి లోక్సభస్పీకర్ మనోహర్ జోషీ చేసిన ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. సిబిఐ పాత్రపై ముందు చర్చను చేపట్టాలని కాంగ్రెస్, ఆర్జెడిలు డిమాండ్ చేశాయి.అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జెడి సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. రాజ్యసభ కార్యక్రమాలేవీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడింది.
Comments
Story first published: Monday, July 21, 2003, 23:53 [IST]