వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకపై లోక్‌సభలో దేశం పట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక చేపట్టిన అక్రమ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చ జరగాలని తెలుగుదేశం సభ్యులు బుధవారం లోక్‌సభలో పట్టుబట్టారు. లోక్‌సభలో వరుసగా బుధవారం మూడో రోజు కూడా తీవ్ర రభస జరిగింది.

కర్ణాటక కృష్ణ, ఇతర నదులపై అక్రమంగా నీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని, ఈవిషయమై తక్షణమే చర్చ జరగాలని అంటూ తెలుగుదేశం సభ్యులు లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. అయితే ఈ వాయిదా తీర్మానాన్నిస్పీకర్‌ మనోహర్‌ జోషి తిరస్కరిస్తూ ప్రశ్నోత్తరాల సమయంలో ఈవిషయాన్ని ప్రస్తావించవచ్చునని చెప్పారు. ప్రభుత్వం చేత తాను సమాధానం ఇప్పిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు. ఇదే సమయంలో అయోధ్యవివాదంపై ప్రతిపక్షాల సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై పట్టుబట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X