వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యోగులపై కరుణించిన జయ
న్యూఢిల్లీ: డిస్మిస్ కుగురైన 1.76 లక్షల ఉద్యోగులను తిరిగి తమిళనాడు ప్రభుత్వంవిధుల్లోకి తీసుకోనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకుతెలియచేసింది. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులఅందర్నీ జయలలిత ప్రభుత్వం తొలగించినవిషయం తెలిసింది.
మానవతా దృక్పథంతో వారినివిధుల్లోకి తిరిగి తీసుకోవాలని సుప్రీం సూచించినమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వ తరఫునసీనియర్ న్యాయవాది కె.కె.వేణుగోపాల్ న్యాయస్థానానికితెలియచేశారు. అయితే, సమ్మె సందర్భంగా హింసాత్మకచర్యలు పాల్పడ్డ ఉద్యోగులపై చర్య తీసుకుంటామనిఆయన జస్టిస్ ఎం.బీ.షా, జస్టిస్ ఎ.ఆర్.లక్ష్మణన్లతో కూడిన బెంచ్ కు వివరించారు. బెంచ్ తుది తీర్పును ఇంకాప్రకటించాల్సి ఉంది.
Comments
Story first published: Thursday, July 24, 2003, 23:53 [IST]