వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిడ్స్‌ పై కలిసి పోరాడుదాం: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో భయంకరంగా వ్యాపిస్తోన్న ఎయిడ్స్‌ మహమ్మరినిఅరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజ్‌ పేయి పిలపునిచ్చారు. రాజకీయ పార్టీలు, సైద్దాంతిక విభేదాలకతీతంగా ఎయిడ్స్‌ పై పోరాటానికి కలిసిరావాలని ఆయన అన్నారు. మనదేశంలో ప్రజారోగ్య సంబంధితవిషయాలపై రాజకీయ పక్షాలేవీ దృష్టి సారించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం న్యూఢిల్లీలో ఎయిడ్స్‌-ఎచ్‌.ఐ.విపై ప్రారంభమైన జాతీయస్థాయిసదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రజారోగ్యానికి సంబంధించినఅంశాలేవీ రాజకీయ పార్టీల ఎజెండాలో లేకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ..ఇకనైనా రాజకీయ పక్షాలువీటిపై దృష్టిసారించాలన్నారు. ..ఇది చాలా ఆందోళన కలిగిస్తుందన్నారు.

ఎయిడ్స్‌ కేవలం అంతర్జాతీయ సమస్యే కాదు...మన దేశంలోనూ ఆందోళన కలిగించే రీతిలో వ్యాపిస్తోందని, మన దేశంలో 40 లక్షల మంది ఎచ్‌.ఐ.వి రోగులున్నారన్న ఓ నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఎయిడ్స్‌ వ్యాధి మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. ఏ వ్యాధిని నిర్మూలించాలన్నా తొలుత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియచేసింది. అలాగే సమర్ధమైన ఫలితం కోసం చక్కటి సమన్యయంతో కలిసికట్టుగా పోరాడాలన్న పాఠాన్ని నేర్పిందని ప్రధానివివరించారు. రాజకీయ పార్టీలు అన్ని కలిసి వస్తే..ఎయిడ్స్‌ ను నివారించడం సులువేనన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X