వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్నెళ్ళలోగా ఎస్డీఎస్ నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న స్టేట్ డెవలప్ మెంట్ సర్వీసు కోసం కసరత్తు జరుగుతోంది. ఆర్నెళ్ళలోగా ఈ సర్వీసు నోటిఫికేషన్ ను వెలువరుస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.
దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమై, సర్వీసు రూపురేఖలు, విధివిధానలపై విస్తృతంగా చర్చించింది. వీటితోనే గ్రూప్-1 నోటిఫికేషన్ ను వెలువడనుంది. ముఖ్యమంత్రితో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని యనమల తెలిపారు.
అలాగే, కోర్టు క్లియరెన్స్ లభించడంతో జూనియర్ లెక్చరర్ల నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1500 లెక్చరర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూఖ్ విశాఖపట్నంలో విలేకరులకు తెలిపారు.
Story first published: Monday, July 28, 2003, 23:53 [IST]