వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధానితో చంద్రబాబు సమావేశం
న్యూఢిల్లీ: ఒక రోజు న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్ హౌస్ లో ఇరువురూ గంటకుపైగా చర్చలు జరిపారు.
రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది పనుల గురించేవీరి మధ్య చర్చ జరిగినప్పటికీ, కర్ణాటక అక్రమంగా చేపడుతోన్న ప్రాజెక్ట్ లవిషయమై బాబు ప్రధానితో అధికంగా చర్చించినట్లు తెలుస్తోంది. కర్ణాటక అక్రమ కట్టడాలను ఆపివేసేలా చర్యలు తీసుకుంటాని ప్రధాని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి అనంతరంవిలేకరులకు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీపీ నేత కె.ఎర్రన్నాయుడు కూడా పాల్గొన్నారు.
Comments
Story first published: Tuesday, July 29, 2003, 23:53 [IST]