వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్షిక ప్రణాళికకు ప్ర.సంఘం ఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2003-2004 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వార్షిక ప్రణాళికకు ప్రణాళికా సంఘం యథాతథంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.10,970 కోట్లతో రాష్ట్ర ప్రణాళికను ప్రతిపాదించింది. ప్రణాళికా సంఘం ఛైర్మన్‌ కె.సి. పంత్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారంనాడు సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి కె.సి.పంత్‌ ను తన మాటల మాయాజాలంతో ఒప్పించారు. ఎటువంటి కోతలు లేకుండా ఆమోదం పొందేలా చూశారు. తాము వనరుల సమీకరణ ద్వారా ఆ మొత్తాన్ని భర్తీ చేయగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు కె.సి. పంత్‌కు చెప్పారు.

పుష్కరాల కోసం 50 కోట్ల రూపాయల అదనపు కేటాయింపులకు సంఘం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరులకు తెలిపారు. మానవవనరుల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొంటోన్న చర్యలను సంఘం అభినందించనట్లు బాబు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X