వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుష్కరాలను ప్రారంభించనున్న బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభిస్తారు. బుధవారం మధ్యాహ్నం గం.12.53 నిమిషాలకు ఆయన పుష్కరాలను ప్రారంభిస్తారు.

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందుకు గాను 35 వేల సిబ్బందిని నియోగించారు. ఏడు జిల్లాల్లో పుష్కర ఏర్పాట్ల కోసం 166 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాజమండ్రి నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి పుష్కరాలు ఇవి. పుష్కరాలతో నగర పాలక సంస్థకు కొత్త శాశ్వత హంగులు ఏర్పడుతున్నాయి. పారిశుధ్యం పనుల కోసమే నగర పాలక సంస్థల ఏడు వేల మంది సిబ్బందిని నియోగించింది.

పుష్కర స్నానాలు చేయడానికి వచ్చే యాత్రికులు ఇబ్బందులు పడకుండా ఘాట్‌ లైన్లను విశాలం చేశారు. ఘాట్‌లు విశాలం కావడం వల్ల యాత్రికులు స్నానాలు చేయడానికి రెండు, మూడు గంటల కన్నా ఎక్కువ నిరీక్షించాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు. గోదావరి వరదలు తగ్గుముఖం పట్టడం కూడా పుష్కర ఏర్పాట్లపై ఏర్పడిన భయాందోళనలు తగ్గిపోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X